/rtv/media/media_files/2025/06/24/ap-road-accident-2025-06-24-08-15-25.jpg)
Ap Road Accident
ఏపీలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో స్పీడుగా దూసుకువచ్చిన ఓ లారీ ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఈ ప్రమాదంలో మరో 16 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. లంకెలపాలెం కూడలి వద్ద నేషనల్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంతో స్థానికుల, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
Anakapalle Road Accident
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం కూడలి వద్ద సిగ్నల్ పడింది. దీంతో వాహనాలన్నీ ఆగాయి. అదే సమయంలో గాజువాక నుంచి అనకాపల్లి వైపు ఓ లారీ అతివేగంగా వచ్చి సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న మూడు కార్లు, 10 వరకు బైక్ లను ఢీకొడుతూ కొంతదూరం దూసుకుపోయింది.
Also Read: ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్ సెటైరికల్ ట్వీట్
అదే సమయంలో పరవాడ వైపు వెళ్తున్న ఓ కంటెయినర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో చనిపోయారు. విశాఖపట్నం జిల్లా అగనంపూడికి చెందిన యర్రప్పడు (30), అనకాపల్లిలోని రింగురోడ్డు ప్రాంతానికి చెందిన కొణతాల అచ్చయ్యనాయుడు (55), అనకాపల్లి మండలం రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ (52) మృతి చెందారు.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడుగురు అనకాపల్లి హాస్పిటల్లో, మరో తొమ్మిదిమంది అగనంపూడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!
anakapalle crime | vizag-road-accident | ap-crime-news | Latest crime news