/rtv/media/media_files/2025/06/24/girl-kills-mother-in-hyderabad-2025-06-24-10-41-07.jpeg)
హైదరాబాద్ జీడిమెట్లలో మంగళవారం అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం తల్లిని దారుణంగా చంపింది. దానికి ఆమె లవర్ తమ్ముడు కూడా హత్యకు సహకరించాడు. ప్రేమ విషయంలో తల్లి అంజలి మందలించిందన్న కోపంతో ఆమెను గొంతు నులిమి, తలపై కొట్టి చాంపారు. అంజలి సాయుధ పోరాట ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ మనవరాళు. ఆమె ఆశయాలకు వారసురాలిగా చెప్పుకుంటుంది.
తేజ శ్రీ స్థానికంగా పదో తరగతి చదువుతుంది. ఆరు నెలల క్రితం శివ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అతని కోసం తల్లిని కూడా చంపడానికి వెనుకాడలేదు శ్రీతేజ. తమ్ముడు యశ్వంత్, లవర్ శివలతో కలిసి తల్లిని కిరాతకంగా హత్య చేసింది. ముగ్గురు కలిసి అంజలి తలపై కొట్టి, గొంతు నులిమి చంపారు. తేజశ్రీపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.