ప్రియుడిపై మోజు.. భర్తను గొడ్డలితో నరికిన భార్య.. కొడుకు ఏం చేశాడంటే!
ప్రియుడి మోజులో భర్తను కొడుకు కళ్లముందే కడతేర్చింది ఓ భార్య. సూర్యాపేట జిల్లా హనుమతండాకు చెందిన కౌసల్య మద్యం మత్తులో ఉన్న భర్త సైదాను గొడ్డలితో నరికి చంపింది. కొన్నాళ్లకు కొడుకు నిజం బయటపెట్టడంతో కౌసల్యను పోలీసులు అరెస్ట్ చేశారు.