/rtv/media/media_files/2025/05/31/pM1MLelAWVr53HP8zTv6.jpg)
Miss World 2025 grand finale kicks off in Hyderabad with glamour and grandeur
మిస్ 2025 ఫైనల్ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో తుది పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ సుందరి కిరిటాన్ని దక్కించుకునేందుకు 108 దేశాల నుంచి అందాల భామలు పోటి పడ్డ విషయం తెలిసిందే. ఇప్పటివరకు నిర్వహించిన పలు పోటీల్లో సత్తా చాటిన 16 మంది క్వార్టర్స్కు ఎంపికయ్యారు. అయితే ఫైనల్ రౌండ్లో అమెరికాకరేబియన్, యూరప్, ఆఫ్రికా, ఆసియాఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు.
Also Read: యుద్ధ విమానం కూలిపోయింది.. ఆపరేషన్ సిందూర్పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
Also Read : పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్మ్యాప్ ఇదే..!
Miss World 2025 Grand Finale
అయితే ఈ నలుగురిలో ఫైనల్ ప్రశ్న ద్వారా వారు ఇచ్చే సమాధానం బట్టి న్యాయనిర్ణేతలు మిస్ వరల్డ్ను ప్రకటించనున్నారు. అయితే ఈ ఫైనల్ పోటీలకు జడ్జిలుగా జూలియా మోర్లీ, సోనూ సూద్, సుధా రెడ్డి, రానా దగ్గుబాటి, మనూషి చిల్లర్, నమత్ర శిరోద్కర్, డోనా వాళ్ష్, జయేష్ రంజన్ ఉన్నారు. తెలంగాణ చేనేత వస్త్రాలతో రూపొందించిన భారతీయ సంప్రదాయ వస్త్రాలతో పోటీదారులు అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Also Read: ఎలాన్ మస్క్ తర్వాత డోజ్ పరిస్థితి ఏంటి? మూతబడుతుందా?
అయితే మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ గా మిస్ ఇండోనేషియా ఎన్నికయ్యారు. పరిశుభ్రమైన నీరు అందరికీ అవసరం అనే విషయం ప్రచారం చేస్తూ,.. నీటి కాలుష్యంపై కార్యక్రమాలు చేస్తున్న మిస్ ఇండోనేషియాకు ఈ అవకాశం దక్కింది.
Also Read : గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో
telugu-news | rtv-news | miss-world | hyderabad | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana-news-updates