KAVITHA ROUTEMAP: పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్‌మ్యాప్ ఇదే..!

జూబ్లీహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్‌ను కవిత నేడు ప్రారంభించారు. BRS, జాగృతి KCRకు 2 కళ్లని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడేందుకు ఆమె రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నారు. BCల కోసం రైల్‌రోకో, KCRకు నోటీసులపై ధర్నాకు సిద్ధమైయ్యారామె.

New Update
KAVITHA ROUTE MAP

బీఆర్ఎస్ పార్టీకి కవిత వరుసగా షాక్‌లు ఇస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లడానికి తనకంటూ ఓ సొంత రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నారు ఆమె. బీఆర్ఎస్ పార్టీతో కాకుండా తెలంగాణ జాగృతి తరపున తెలంగాణ ప్రజల కోసం కొట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు (శనివారం) జూబ్లీహిల్స్‌లో తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు కొంచె ఆశ్చర్యం కలిగించేవిధంగా ఉన్నాయి. BRS, తెలంగాణ జాగృతి కేసీఆర్‌కు 2 కళ్లు అని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎన్నడూ ఆమె బీఆర్ఎస్‌, జాగృతిని వేరు చేసి మాట్లాడలేదు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్పూర్తితోనే తెలంగాణ జాగృతి ఏర్పాటైందని కవిత తెలిపారు.

Also Read :  పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్‌మ్యాప్ ఇదే..!

Also Read :  పాక్‌ను తిడుతూ యువతి పోస్టు.. అరెస్టు చేసిన పోలీసులు

Kavitha Road Map With Telangana Jagruthi

స్థానిక సంస్థల ఎన్నికల లోగా బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టకుంటే రైల్ రోఖో నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు. బీసీల కోసం పోరాటానికి ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇచ్చారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. ఈసారి ఆమె ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా.. ఆమె అధికార పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చివరికి జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి అని నినాదాలు ఇచ్చారు. BRS పార్టీ ప్రస్తావన అసలే తీసుకురాలేదు కవిత. దీంతో ఆమె ప్రజల్లోకి వెళ్లడానికి సొంతంగా రూట్‌మ్యాప్ క్రియేట్ చేసుకుంటున్నట్లు అర్థమౌతుంది.

సొంత పార్టీ స్థాపించే దిశలో కవిత మొదటి అడుగు, సృష్టమైన తెలుస్తోంది. ఈరోజు ప్రారంభించిన తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసులో పూలే, అంబేద్కర్‌, కేసీఆర్, జయశంకర్‌ విగ్రహాలు ఉన్నాయి. తెలంగాణ తల్లి, కేసీఆర్, జయశంకర్ ఫోటోలతో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయే తప్పా.. బీఆర్ఎస్ జెండాలు, ఆనవాలు లేవు. తెలంగాణ సెంటిమెంట్‌తో మరోసారి ప్రజల్లోకి వెళ్లేలా ప్లానింగ్ చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణకు తోడు సామాజిక న్యాయం అంటూ కొత్త ఎజెండా సిద్ధం చేసుకుంది ఆమె. కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్‌‌కు నోటీసులు పంపారు. దీనికి వ్యతిరేకంగా ఆమె జూన్ 4న ధర్నాకు పిలుపునిచ్చారు. KCR మీద ఈగ వాలినా ఊరుకోనని కవిత కాంగ్రెస్ సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చారు. KCR తాను వ్యతిరేకం కాదని, ఆయన తనతోనే ఉన్నారని కవిత అంటున్నారు.

Also Read :  జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే

Also Read :  గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో

 

Telangana Jagruthi | kavitha | telangana | kcr | latest-telugu-news | ktr vs mlc kavitha | mlc kavitha sensational letter
 

Advertisment
Advertisment
తాజా కథనాలు