Uttam Kumar: యుద్ధ విమానం కూలిపోయింది.. ఆపరేషన్ సిందూర్పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
పాక్తో జరిగిన యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు కూలాయా అనే ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానం కూలినట్లు సీడీఎస్ అనిల్ చౌహన్ చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఆపరేషన్ సిందూర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్తో జరిగిన యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు ఏమైనా కూలాయా అని అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి సమాధానం ఇవ్వలేదని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానం కూలినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహన్ చెప్పినట్లు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
'' ఆపరేషన్ సిందూర్లో రాఫెల్ యుద్ధ విమానాలు ఏమైనా కూలుపోయాయా అని రాహుల్ గాంధీ మొదటి నుంచి అడుగుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా ట్వీట్ చేస్తారు ?. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత ఎయిర్ఫోర్స్ విజయంపై మేము గర్విస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన ఆపరేషన్. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం అనేది ఆర్మీ సాధించిన విజయం.
ఫైటల్ విమానాలు, ఆయుధాల సరఫరా ఆలస్యం అవుతోందని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. చైనా, పాక్లతో ముప్పు ఉన్న నేపథ్యంలో మన భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. తేలికపాటి యుద్ధ విమానాల సరఫరా కూడా ఆలస్యం అవుతోంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి. ఆపరేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R & D) విభాగాల్లోకి బెస్ట్ బ్రెయిన్స్ రావడం లేదని'' ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.
The fact that the fighter aircraft were down is something that the Government of India needs to stop denying. The CDS himself mentioned that. Earlier Air Marshal Bharti had mentioned it indirectly in his briefing along with the DGMO. He specifically said, "losses are normal in… pic.twitter.com/mNdCdb3xGv
Uttam Kumar: యుద్ధ విమానం కూలిపోయింది.. ఆపరేషన్ సిందూర్పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
పాక్తో జరిగిన యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు కూలాయా అనే ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానం కూలినట్లు సీడీఎస్ అనిల్ చౌహన్ చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
Uttam Kumar Reddy
ఆపరేషన్ సిందూర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్తో జరిగిన యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు ఏమైనా కూలాయా అని అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి సమాధానం ఇవ్వలేదని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానం కూలినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహన్ చెప్పినట్లు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Also Read: మాట్లాడుకోడాల్ లేవు.. పాకిస్తాన్కు తుపాకులతోనే సమాధానం చెప్తాం
Uttam Kumar Reddy Comments On Operation Sindoor
'' ఆపరేషన్ సిందూర్లో రాఫెల్ యుద్ధ విమానాలు ఏమైనా కూలుపోయాయా అని రాహుల్ గాంధీ మొదటి నుంచి అడుగుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా ట్వీట్ చేస్తారు ?. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత ఎయిర్ఫోర్స్ విజయంపై మేము గర్విస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన ఆపరేషన్. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం అనేది ఆర్మీ సాధించిన విజయం.
Also Read: పాక్కు గూఢచర్యం..మరో ఇంటిదొంగ అరెస్ట్... భారత యుద్ధ నౌకల సమాచారం చేరవేసిన ఇంజినీర్
ఫైటల్ విమానాలు, ఆయుధాల సరఫరా ఆలస్యం అవుతోందని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. చైనా, పాక్లతో ముప్పు ఉన్న నేపథ్యంలో మన భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. తేలికపాటి యుద్ధ విమానాల సరఫరా కూడా ఆలస్యం అవుతోంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి. ఆపరేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R & D) విభాగాల్లోకి బెస్ట్ బ్రెయిన్స్ రావడం లేదని'' ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.
Also Read: భారత్ దౌత్యం ఫలించింది..పాక్ గురించి తెలుసుకున్నామన్న కొలంబియా
Also Read : టీడీపీ సిద్దాంతాలను ఆవిష్కరించిన మహానాడు
telugu-news | rtv-news | uttam-kumar-reddy | telangana