/rtv/media/media_files/2025/07/02/medaram-jatara-2025-07-02-10-28-17.jpg)
Medaram jatara -2026
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర(Medaram Tribal Fair 2026) గా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర(medaram sammakka sarakka jatara) వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ జాతరను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జాతరకు రూ.150 కోట్లు మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను మేడారం మహా జాతర ఏర్పాట్లతో పాటు శాశ్వత నిర్మాణాల పనులకు వినియోగించాలని నిర్ణయించారు. జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఈ నిధులు వినియోగించనున్నారు.
Medaram Tribal Fair 2026
ఈ నిధులతో మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు వినియోగించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా నిర్వహించనున్నామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మేడారం జాతర ప్రతిష్టను మరింత పెంచేందుకు ప్రభుత్వం చూపుతున్న కృషి అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.
Also Read: సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది కుక్కల ప్రేమికుడే.. పక్కా ప్లాన్తో దాడి చేశాడా?
ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరలో లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే జాతరకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సారి గతం కంటే మరింత వైభవంగా జాతర నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే.. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలను పూజారులు అధికారికంగా ప్రకటించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరగా, జనవరి 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. జనవరి 30న భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా తరలి వస్తారు. చివరి రోజు జనవరి 31న అమ్మవార్ల వనప్రవేశం జరుగుతుంది. మూడో రోజైన జనవరి 30న సమ్మక్క, సారలమ్మ వనదేవతలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజుల వనప్రవేశం కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించే ప్రధాన సందర్భంగా జాతర ఉత్సవాలు సాగనున్నాయి.
ఇది కూడా చూడండి:తెలంగాణలో కొత్త మద్యం షాపులు.. లైసెన్స్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం