TG Crime: బస్సులో అనుమానస్పదంగా వ్యక్తి..తనిఖీ చేస్తే..ఏనుగు దంతాలు..వాటి విలువ  ఎంతంటే?

బస్సులో అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా రెండు ఏనుగు దంతాలు బయటపడ్డాయి. వాటివిలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. కాగా నిందితులు శేషాచలం అడవుల నుంచి ఏనుగు దంతాలు తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిన్నారు.

New Update
Smuggling of elephant ivory

Smuggling of elephant ivory

TG Crime : బస్సులో అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా రెండు ఏనుగు దంతాలు బయటపడ్డాయి. వాటివిలువ సుమారు రూ. 3కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. కాగా నిందితులు శేషాచలం అడవుల నుంచి ఏనుగు దంతాలు తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయానికి యత్నించినట్లు తెలిసింది. పట్టుబడ్డ నిందితుడి పేరు మహర్షి అని తేలింది. కాగా పట్టుబడ్డ దంతాల విలువ రూ.3కోట్ల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు.  రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Also Read: వందేభారత్‌ రైలులో దారుణం..సీటు మారలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే

నిందితుడు ఏపీకి చెందిన రేకులకుంట ప్రసాద్ (మహర్షి) ని అరెస్ట్ చేశారు. ప్రసాద్ వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండు ఏనుగు దంతాల విలువ రూ. 3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.  కాగా నగరంలో ఏనుగు దంతాల బిజినెస్‌ నడుస్తుందన్న అటవిశాఖ అధికారుల ఫిర్యాదు మేరుకు రాచకొండ ఎస్ఓటి పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ తో ఈ ముఠాను పట్టుకున్నారు. ప్రసాద్ తిరుపతి జిల్లాలోని శేషాచలం ఫారెస్ట్ నుంచి ఏనుగు దంతాలు తీసుకువచ్చాడని తెలిపారు.

Also Read: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!

 ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. “ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నాము.. రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నాము.. ఇవి ఒరిజినల్ హా, కాదా అని ఫారెస్ట్ వాళ్ళతో చెక్ చేయించాము.. నిజమైనవి అని తేలిందని తెలిపారు.. వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972ప్రకారం ఇది చట్టరీత్య నేరము.. ఏనుగు నుంచి ఇవి కట్ చేసి సేకరించారు.. ఈ కేసులో ప్రకాష్ , లోకేశ్వర్ రెడ్డి ఈ దందా కొనసాగిస్తున్నారు.. శేషాచలం అడవులలోని ఏనుగుల నుంచి ఇవి సేకరించారు.. రాచకొండ పోలీసులు ఇల్లీగల్ యాక్టివిటిపై దృష్టి సారించారని తెలిపారు.. బస్సుల్లో తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు.. బస్సులో ఒక పెట్టలో పెట్టి తీసుకొచ్చారని అనుమానంతో చెక్‌ చేయగా ఇవి పట్టుబడ్డాయన్నారు.

 పట్టుబడ్డ ఏనుగు దంతాలు 5.62కేజీలు ఉన్నాయని సీపీ వివరించారు. నిందితులు ఎర్ర చందనం కూడా స్మగ్లింగ్ చేస్తున్నారని తేలిందన్నారు.. రూ. 3కోట్లు విలువ గల ఏనుగు దంతలు సీజ్ చేసాం.. కేజీ ఏనుగు దంతాలు మార్కెట్లో 50 నుంచి 60 లక్షల వరకు పలుకుతుందన్నారు. నిందితుడు ప్రసాద్ మాత్రమే పట్టుబడ్డాడు.. లోకేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు.. ప్రసాద్, లోకేశ్వర్ ఇద్దరు గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడి జైల్లో ఉన్నారు.. ఇద్దరికి జైళ్ళో పరిచయం ఉంది.. ఇప్పుడు ఏనుగు దంతాల స్మగ్లింగ్ కి పాల్పడ్డారనితెలిపారు.

Also Read: ఇదేం ప్రేమరా నాయనా...సొంతింటి కల కోసం..20 మంది అబ్బాయిలతో ప్రేమాయణం

Advertisment
Advertisment
తాజా కథనాలు