/rtv/media/media_files/2025/06/09/vCA7kRqGbBU8EODy5UH6.jpg)
Batti Vikramarka
తెలంగాణలో మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు ఇప్పటిదాకా రూ.182 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామని తెలిపారు. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు.
Also Read: అశ్లీల చిత్రాల్లో నటించాలని ఒత్తిడి.. 6 నెలలు చిత్రహింసలకు గురైన యువతి
TGSRTC - Bhatti Vikramarka
'' మహాలక్ష్మీ పథకం కింద ఉచిత ప్రయాణ వల్ల కొందరు ఆందోళన చెందారు. మహిళలు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించినప్పటికీ ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లించింది. ఇప్పటిదాక ఆర్టీసీకి రూ.6,088 కోట్లు చెల్లించాం. బస్సులను పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. అందుకే ఆర్టీసీ నిలదొక్కుకుంటోందని'' భట్టి విక్రమార్క తెలిపారు. ఇదిలాఉండగా.. ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్ - షాకింగ్ వీడియో
మరోవైపు టీజీఎస్ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి(సోమవారం) ఇది అమలులోకి వచ్చింది. ఇప్పటివరకు నెలకు రూ.1,150గా ఉన్న ఆర్డినరీ పాస్ ధరను రూ.1,400కు పెంచారు. మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను రూ.1,300 నుంచి రూ.1,600కు, మెట్రో డీలక్స్ పాస్ను రూ.1,450 నుంచి రూ.1,800కు పెంచారు. అంతేకాకుండా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉపయోగించే గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా పెరిగాయి. రోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు బస్ పాస్పై ఆధారపడుతుంటారు. వారికి నెలవారీ ఖర్చు రూ.250-400 వరకు పెరగుతుండటంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: 20 ప్రశ్నలు.. ఆధారాలతో సహా అన్నీ బయటపెట్టానన్న హరీశ్ రావు!
Also Read : రిలేషన్ షిప్ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..
telugu-news | rtv-news | mahalaxmi-scheme | tgsrtc | latest-telugu-news | latest telangana news | today-news-in-telugu