Kaleshwaram Commission: 20 ప్రశ్నలు.. ఆధారాలతో సహా అన్నీ బయటపెట్టానన్న హరీశ్ రావు!

మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైయ్యారు. బీఆర్కే భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఆయన్ని 45 నిమిషాల పాటు ప్రశ్నించింది. కమిషన్ ప్రశ్నలన్నీటికీ ఆధారతోసహా సమాధానాలు చెప్పానని ఆయన మీడియాతో అన్నారు.

New Update
Cbi enquiry on kaleshwaram

Kaleshwaram Commission

Kaleshwaram Commission: మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) సోమవారం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైయ్యారు. BRK భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఆయన్ని 45 నిమిషాల పాటు ప్రశ్నించింది. నీటిపారుదల శాఖ మాజీమంత్రి హరీశ్ రావుపై దాదాపు 20 ప్రశ్నల వర్షం కురిపించింది విచారణ కమిషన్. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలతో సహా అన్నీ కమిషన్ ముందు పెట్టామన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని ఆయన్న కమిషన్ ప్రశ్నించినట్లు హరీశ్ తెలిపారు.

Also Read: సవకే సవక.. రూ.14వేల భారీ డిస్కౌంట్ - 8GB ర్యామ్, 50MP కెమెరా ఫోన్‌ తక్కువకే!

Also Read: ఏపీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

ప్రాజెక్ట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉంది..

తుమ్మిడిహెట్టి నుంచి కాలువలు తవ్వకుండా ఎక్కడినుంచో ఎందుకు తవ్వారని కాళేశ్వరం కమిషన్ అడిగినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య 5సార్లు మీటింగుల జరిగాయని, ఆ మీటింగ్స్ సారాంశాన్ని మొత్తం కమిటీకి వివరించానని హరీశ్ రావు అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లులేని చోట ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసిందని.. దీంతో నీళ్లు ఉన్న చోటుకు ప్రాజక్ట్ డిజైన్ మార్చామని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజక్ట్‌కు కేబినెట్ ఆమోదం ఉందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదీ నోటి మాటగా చెప్పలేదన్నారు. కేసీఆర్ స్వయంగా ముంబైకు వెళ్లి అడిగినా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని హరీశ్ రావు కమిషన్‌కు చెప్పినట్లు మీడియాకు తెలిపారు. 

Also Read: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు కమిటీ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 6న ఈటల రాజేందర్‌ను కమిషన్ ప్రశ్నించింది. ఈరోజు హరీశ్ రావు, జూన్ 11న కేసీఆర్‌ను ఎక్వైరీ చేయనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు