/rtv/media/media_files/2025/06/09/qDoTWMTYd0glb5wF2Xfa.jpg)
Techie Kills Married Mother Of 2 He Was Dating in Bengaluru
ఈమధ్య కాలంలో ప్రేమికులు కూడా ఒకరినొకరు చంపుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులోని ఓయో హోటల్లో రూమ్లో ఓ యువతి బాయ్ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హరిణి (36), యషాస్ (25) మధ్య పరిచయం ప్రేమగా మారింది. వీళ్లద్దరి మధ్య 11 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ కూడా కలిసున్నారు. హరిణికి పెళ్లి అయ్యింది, ఇద్దరు పిల్లకు కూడా ఉన్నారు. కొన్నాళ్లు యషాస్, హరిణి బాగానే గడిపారు. అయితే శుక్రవారం రాత్రి హరిణి యషాస్తో కలిసి ఓయో రూమ్కు వెళ్లింది.
Also Read: అశ్లీల చిత్రాల్లో నటించాలని ఒత్తిడి.. 6 నెలలు చిత్రహింసలకు గురైన యువతి
Techie Kills Married Mother
తెల్లవారేసరికి ఆమె శవమై తేలింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రూమ్లో ఆ యువతి కత్తిపోట్లకు గురైనట్లు గుర్తించారు. అయితే హరిణి, యషాస్ ఇద్దరూ కెంగేరీ అనే ప్రాంతానికి చెందినవారే. అయితే ఈ ఘటనకు సంబంధించి సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.
Also Read: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్ - షాకింగ్ వీడియో
ఈ వ్యవహారంపై బెంగళూరు సౌత్ డీసీపీ, లోకేశ్ బి జగలాసర్ మాట్లాడారు. '' జూన్ 5,7వ తేదీ మధ్య రాత్రి ఘటన చోటుచేసుకుంది. హరిణి.. యషాస్తో తమ సంబంధాన్ని తొలగించుకుందామని అనుకుంది. అతడిని దూరం పెట్టేందుకు యత్నించింది. దీంతో తీవ్ర ఆగ్రహం, అసూయకు గురైన యషాస్ ఆమెను రూమ్లో దారుణంగా పొడిచి హత్య చేశాడని'' డీసీపీ లోకేశ్ తెలిపారు.
Also Read: భార్య మాస్టర్ ప్లాన్.. భర్తను హనీమూన్కు తీసుకెళ్లి లేపేసింది..!
Also Read : పెళ్లి పీటలు ఎక్కబోతున్న విరూపాక్ష డైరెక్టర్.. ఘనంగా ఎంగేజ్మెంట్ ! ఫొటోలు వైరల్
bengaluru | rtv-news | oyo-room | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news