Medak: విషాదం.. వడ్ల మిషన్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో వరికోత యంత్రం ఢీకొని ఓ నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటిముందు ఆడుకుంటుండగా ఆ బాలుడిని వడ్ల మిషిన్ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

New Update
Death

Death

మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో వరికోత యంత్రం ఢీకొని ఓ నాలుగేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇంటిముందు ఆడుకుంటుండగా ఆ బాలుడిని వడ్ల మిషన్ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  సమాచారం మేరకు పోలీసుల ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను వాళ్లు అదుపులోకి తీసుకున్నారు. చివరికి బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాలుడి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

Also Read: విషాదం.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత!

4Yrs Old Boy Dies By Harvester

ఇదిలాఉండగా శనివారం ఏపీలోని నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు కరవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బేతంచెర్ల పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీలో హుస్సేన్ బాషా, ఆశ దంపతులు నివసిస్తున్నారు. వీళ్లకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే చిన్న కొడుకు మొహిద్దీన్ (4) శుక్రవారం సాయంత్రం మరో బాలుడితో కలిసి ఇంటికి దగ్గర్లో ఆడుకుంటున్నాడు. 

Also Read: దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

ఇదే సమయంలో ఓ శునకాల గుంపు వీళ్ల దగ్గరికి వచ్చింది. దీంతో ఆ చిన్నారులు పరిగెత్తారు. కానీ మొహిద్దీన్ మాత్రం కుక్కల దాడికి బలయ్యాడు. తీవ్రంగా గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Also Read: ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ...30 నిమిషాలపాటు దానిపైనే చర్చ...

Also Read :  'రామ్ ద్రోహి'.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!

rtv-news | death | latest telangana news | telangana news live updates | telangana news today | telangana-news-updates | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు