/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/badrachalam-jpg.webp)
Bhadrachalam
వేసవిసెలవులు ముగుస్తుండటం, ఆదివారం సెలవు దినం కావడంతో దేవాలయాలకు జనం పోటెత్తారు. తెలంగాణలోని ప్రధాన ఆలయాలైన భద్రాచలం, యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామి వారికి అర్చకులు అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బంగారు పుష్పాలతో అర్చన చేశారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరాం నామస్మరణతో మారుమోగింది. కాగా భద్రాచలంలో స్వామివారి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నట్లు భక్తులు తెలిపారు.
Also Read : ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా - పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
Also Read: గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో
యాదగిరిగుట్ట...
ఇక తెలంగాణలో మరో ప్రముఖ దేవాలయంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. నరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. యాదగిరీశుడి ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణస్వామి వ్రత మండపం, కారు పార్కింగ్, బస్టాండ్ ప్రదేశాల్లో సందడి నెలకొంది. కాగా ఆలయంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించడానికి ఈవో వెంకట్రావు ఆలయ పరసరాల్లో పర్యటించారు.
Also Read: జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే
Also Read: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో
bhadradri-kothagudem | bhadradri-in-kothagudem-district | bhuvanagiri | badrachalam | yadagiri-gutta | Yadadri Bhuvanagiri District | yadagirigutta | yadagirigutta golden gopuram