Sexual Harassment: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో

మచిలీపట్నంలో వృద్ధ ఉపాధ్యాయుడు తిక్కిసెట్టి నట దేవేంద్రరావు నీచమైన చర్యకు పాల్పడ్డాడు. మైనర్ బాలికను లైంగిక వేధించాడు. సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి చేశాడు. అతడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

New Update

మహిళలపై రోజు రోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉంటే తండ్రి, సోదరులు.. పాఠశాలకు వెళితే ఉపాధ్యాయుల మధ్య ఆడబిడ్డలు నలిగిపోతున్నారు. చిన్న వయసులోనే చిన్నారులను చిదిమేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవారే కొన్నిసార్లు కాటేస్తున్నారు. 

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

పోనీ.. పాఠశాలలో అయినా ప్రశాంతత ఉంటుందా? అంటే అక్కడ కూడా కరువైంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వారిపాలిట శాపంగా మారుతున్నారు. పాస్ చెయ్యిస్తానని ఒకరు, చెప్పిన మాట వినకపోతే మార్కులు తక్కువ వేస్తానని ఇంకొకరు.. ఇలా ఉపాధ్యాయుల చేతిలో నలిగిపోయినవారెందరో ఆడబిడ్డలు ఉన్నారు. 

సెక్సువల్ ఫేవర్ చేయ్యు

తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ముసలి వయసులో ఓ ఉపాధ్యాయుడు మనవరాలి వయసున్న మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. సెక్సువల్‌గా ఫేవర్ చేయాలని ఆ విద్యార్థినిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆ ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇప్పుడీ ఘటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

ఏపీలోని మచిలీపట్నంలో తిక్కిసెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజ్ మాస్టారు నీచమైన పనిచేశాడు. విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. తనకు సెక్సువల్‌గా ఫేవర్ చేయాలని ఆ మైనర్ బాలికను ఎంతగానో వేధించాడు. ఆ వృద్ధ ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంతలో తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో బాలిక ప్రమాదం నుంచి బయటపడింది. 

దీంతో ఆ ఉపాధ్యాయుడిపై పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు అయింది. అయితే కేసు రిజిస్టర్ చేసి 10 రోజులు గడుస్తున్నా ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకోకపోవడంతో బాధిత ఫ్యామిలీ ఆందోలన వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఈ కేసును రాజీ కుదిర్చుందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఉపాధ్యాయుడు దేవేంద్రరావు 1983 నుండి 1995 వరకు మచిలీపట్టణం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో పిటి టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేదించేవాడని సమాచారం

Advertisment
Advertisment
తాజా కథనాలు