/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
Revanth Reddy
బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానితో సహా అందరి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తెలంగాణాకు న్యాయం జరగకపోతే.. లీగల్ ఫైట్ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగ, జలాల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి కోరారు. బనకచర్లపై సచివాలయంలో బుధవారం అఖిలపక్ష ఎంపీలతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీలో పాల్గొన్నారు.
Also Read: Dhanush: ధనుష్ డైరెక్షన్ లో పవన్.కళ్యాణ్ ... 'కుబేరా' ఈవెంట్ లో హీరో కామెంట్స్ వైరల్!
Also Read : రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్రదేశం: బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్
Revanth Reddy About Banakacharla Project
మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా తెలంగాణ ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదని రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రప్రభుత్వం 21, -9, -2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్ ప్రతిపాదన ఇచ్చారు. ఆ సమావేశంలో హరీష్ రావుగారు కూడా పాల్గొన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మళ్లీ 13 ఆగస్టు 2019లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రకటించారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలని కెసిఆర్, జగన్ ప్రగతి భవన్లో 4సార్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారని గుర్తు చేశారు. ఈ మీటింగ్ మినిట్స్ను రిఫరెన్స్గా చూపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
Also Read : ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?
latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news live updates | telangana-news-updates