Actress Kajol: బాలీవుడ్ నటి కాజోల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆమె రామోజీ ఫిలిం సిటీ "ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశం" అని, మళ్లీ అక్కడికి వెళ్లకూడదని అనుకుంటున్నానని చెప్పడం నెట్టింట వైరల్ గా మారింది.
భయంకరమైన ప్రదేశం
అయితే ఇటీవలే తాను నటించిన హారర్ ఫిల్మ్ 'మా' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్ షూటింగ్ కి సంబంధించిన అనుభవాలను పంచుకుంది. ఈ క్రమంలో కాజోల్ మాట్లాడుతూ .. ''కొన్ని షూటింగ్ ప్రదేశాల్లో నెగెటివ్ వైబ్స్ ఎదురయ్యాయి. అవి చాలా భయానకంగా అనిపించాయి.వెంటనే ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవాలనిపించింది.. మళ్ళీ అక్కడికి రాకూడదు అనే ఫీలింగ్ కలిగింది'' అని తెలిపింది. దీనికి ఉదాహరణగా ఆమె హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీని ప్రస్తావించారు. ''రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశమని'' పేర్కొంది. మరి రామోజీ ఫిల్మ్ సిటీలో ఆమెను అంతలా భయపెట్టిన సంఘటన ఏమిటో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.
"I’ve felt negative vibes during shoots. Some places were so scary, I just wanted to leave and never come back.
— Movie Threat (@MovieThreat) June 18, 2025
Like Ramoji Film City in Hyderabad itself, which is known as one of the most haunted places in the world."
- Bollywood Actress #Kajol pic.twitter.com/0znOCXyQ4s
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీల్లో ఒకటైన రామోజీ ఫిల్మ్ సిటీలో అనేక విజయవంతమైన సినిమాలు చిత్రీకరించబడ్డాయి. అలాంటి ప్రఖ్యాత ప్రదేశంపై కాజోల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి కాజోల్ తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే కాజోల్ నటించిన 'మా' సినిమా జూన్ 20న విడుదల కానుంది.