Nirmal : నిర్మల్ జిల్లాలో స్వర్ణవాగుపై నిర్మించిన సాకేర చెక్డ్యామ్ పేల్చివేతపై వివాదం నెలకొంది. ఈ విషయమై మాజీ ఎమ్మె్ల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కావాలనే చెక్ డ్యామ్ను పేల్చివేశారని మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతోనే చెక్డ్యామ్ను అక్రమంగా పేల్చివేశారని మండిపడ్డారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన ఏలేటిని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఈ పీరియడ్స్ సంకేతాలను విస్మరించవద్దు.. తీవ్రమైన సమస్యలు తప్పవు!
సాకేర చెక్డ్యామ్ నిర్మాణం చేపట్టిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెక్ డ్యాం నిర్మాణం జరిగిందని, దీని కూల్చివేత వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందని ఇంద్రకరణ్ ఆరోపిస్తున్నారు. అయితే, బీజేపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. చెక్డ్యామ్ కూల్చివేతకు ఎమ్మెల్యే ఏలేటికి ఎలాంటి సంబంధం లేదని వారన్నారు. కలెక్టర్ ఆదేశాలతోనే దీన్ని కూల్చివేశారన్నారు. ఈ చెక్డ్యామ్ నిర్మాణంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని, అందుకే కూల్చివేతలు చేపట్టినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు. చెక్డ్యాం వల్ల బ్యాక్ వాటర్ ముప్పు ఏర్పడుతోందని, దీనివల్ల పలు కాలనీలు నీట మునిగే అవకాశం ఉన్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ముఖ్యం: విశాఖ కలెక్టర్
Also Read : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
కాగా జిల్లాలోని స్వర్ణ వాగుపై జీఎన్ఆర్ కాలనీ సమీపంలో గత ప్రభుత్వం హాయాంలో చెక్ డ్యామ్ నిర్మించారు. అయితే ఈ డ్యామ్ వల్ల వర్షాకాలంలో పలుకాలనీలు నీట మునిగే ముప్పు పొంచి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో చెక్ డ్యామ్ను ఇరిగేషన్ అధికారులు మే 29న బాంబులతో పేల్చివేశారు. వర్షాకాలంలో వరద ముప్పు పొంచి ఉండటం వల్లే జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో ఈ పేల్చివేతలు జరిగాయని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read : అగ్రతారల ‘జూన్’.. బడా హీరోలదే హవా - మొత్తం ఎన్ని సినిమాలంటే?
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!