/rtv/media/media_files/2025/05/30/Wix6qcQhw0mTJ9e54piL.jpg)
TG Crime : హైదరాబాద్లోని బోరబండకు చెందిన బీఆర్ఎస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహ్మద్ సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య స్థానికంగా కలకలం సృష్టించింది. సర్దార్ తన ఇంటి మూడో అంతస్తు పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. కాగా హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపుల మూలంగానే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని సర్దార్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఫసియుద్దీన్, ఆయన భార్య హబీబా సుల్తానా, పర్సనల్ సెక్రెటరీ సప్తగిరి తదితరుల మీద బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సర్దార్ ఆత్మహత్యతో బోరబండలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో ఫసియుద్దీన్ ఇంటిపై దాడి చేస్తారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.పశ్చిమ మండల డీసీపీ విజయ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని సర్దార్ కుటుంబసభ్యులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్న మహ్మద్ సర్దార్ స్థానికంగా ఎస్ఆర్టీ నగర్లో నివాసం ఉంటున్నాడు. ఆయన మెడికల్ షాపు నిర్వహిస్తూ కుటుంబంతో ఉంటున్నాడు. కాగా గత ఎన్నికల్లో బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ నుంచి గెలిచి హైదరాబాద్ డిప్యూటీ మేయర్గా పనిచేశాడు. మొన్నటి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరాడు. ఫసియుద్దీన్ కు సర్దార్ ప్రధాన అనుచరుడి కూడా. అయితే తనతో పాటు కాంగ్రెస్లోకి రావాలని కార్పొరేటర్ కోరినప్పటికీ సర్దార్ వెళ్లలేదని దానితో ఆయనపై కక్ష కట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సర్దార్ ఎస్ఆర్టీ నగర్లోని తన జీప్లస్1 ఇంటిపై అదనంగా రెండు అంతస్తులు, పైన పెంట్ హౌస్ నిర్మించాడు. ఈ విషయంలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేసినట్లు జీహెచ్ఎంసీ నుంచి దాదాపు 22 నోటీసులు జారీ చేశారు. అయితే ఇదంతా స్థానిక కార్పొరేటర్ ఫసియుద్దీన్ కక్షగట్టి చేయిస్తున్నట్లు సర్దార్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ 30న జీహెచ్ఎంసీ అధికారులు పెంట్హౌజ్ను కూల్చేశారు.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
ఈ విషయాన్ని సర్దార్ తన స్నేహితుల వద్ద చెప్పుకుని బాధపడినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగానే బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ మాట్లాడుతూ ఇంటిపైకి వెళ్లిన సర్దార్ కూల్చేసిన పెంట్ హైజ్ వద్ద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. కాగా సర్దార్ ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత ఫసియుద్దీన్ డబ్బులు డిమాండ్ చేశాడని, దీనికి నిరాకరించడంతో కార్పొరేటర్, ఆయన భార్య హబీబా సుల్తానా, మరికొందరు అనుచరులు, అధికారులు వేధింపులు మొదలుపెట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన సోదరుడు మహ్మద్ ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదుతో కార్పొరేటర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు