Viral News: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!

2021లో కరోనా సమయంలో ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ ఆడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఆస్పత్రిలో సరిపడా పడకలు లేవని చికిత్స తీసుకుంటున్న ఓ మహిళా పేషంట్ ని చంపేయమని డాక్టర్ దేశ్ పాండే..

New Update
covid patient audio viral

covid patient audio viral

2021లో కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని అల్లకల్లోలం చేసింది.  వైరస్ బారిన పడిన పేషంట్లతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోయాయి. బాధితులకు పడకలు, ఆక్సిజన్‌  సిలిండర్లు  దొరకడమే కష్టంగా మారిన దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి.  

Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్

Also Read: ఉన్నత చదువుల కోసం అమెరికాకు బదులుగా ఈ దేశాలే బెస్ట్

కరోనా పేషేంట్ ని చంపేయ్

అయితే ఆ సమయంలో మహారాష్ట్రలోని ఓ ఆస్పత్రిలో జరిగిన హృదయవిదారక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్పత్రిలో సరిపడా పడకలు లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్న ఓ పేషంట్ ని చంపేయమని ఓ డాక్టర్ మరో డాక్టర్ కి సూచించిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. సదరు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. 

Also read:  చైనా విద్యార్థుల వీసాల రద్దు? ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం

అసలేం జరిగిందంటే.. 

అయితే ఉద్గిర్‌ ఆస్పత్రిలో  కరోనాతో ఓ మహిళా పేషేంట్ జాయిన్ అయ్యింది. ఆమె దాదాపు పదిరోజుల పాటు అక్కడే చికిత్స తీసుకుంది.   ఈ క్రమంలో ఏడవ రోజు ఆమె భర్త బయట కూర్చొని ఉండగా.. అతడి పక్కనే  అదే హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ డాంగే భోజనం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో డాక్టర్ డాంగే కి మరో డాక్టర్ దేశ్ పాండే నుంచి  ఫోన్ రావడంతో స్పీఎకర్ లో పెట్టి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో డాక్టర్ దేశ్ పాండే మీ ఆస్పత్రిలో ఎన్ని పాదకులు ఉన్నాయని అడిగాడు. దానికి డాంగే ప్రస్తుతం ఖాళీ లేవని డాంగే చెప్పాడు. దీంతో డాక్టర్  దేశ్ పాండే ఓ మహిళా రోగి పేరు చెప్పి.. ఆమెను చంపేయ్.. నీకు అలవాటే కదా అని డాంగే తో మాట్లాడాడు. డాంగే పక్కనే ఉన్న మహిళా రోగి భర్త ఇదంతా విని షాక్ కి గురయ్యాడు. కానీ.. అప్పుడు తన భార్య అదే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుండడంతో ఏం మాట్లాడలేకపోయాడు. 

దాదాపు నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ సంభాషణ ఆడియో ఇప్పుడు ఎలాగో బయటకు వచ్చింది. ఇది కాస్త ఆ బాధిత మహిళా చెవిన పడడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంపేయమని చెప్పిన డాక్టర్ దేశ్ పాండే పై కేసు నమోదు చేశారు. అతడి మొబైల్ కూడా సీజ్ చేశారు. మరో వైద్యుడు డాంగే కి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read :  మీ చర్మం నిగనిగలాడాలంటే ఈ ఫుడ్స్ మీ డైట్‌లో చేర్చుకోండి

 

latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు