Karnataka: రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

మతఘర్షణలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. యాంటీ న‌క్సల్ ఫోర్స్ నుంచి 248 మందిని తీసుకొని స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ద‌క్షిణ క‌న్నడ‌, శివ‌మొగ్గం, ఉడిపిలో వారు మ‌త‌ఘ‌ర్షణలపై ఫోకస్ చేయనున్నారు.

New Update
Special force

మతఘర్షణలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి ప్రకటించారు. ఈమేరకు క‌ర్నాట‌క స‌ర్కారు కొత్త ఆదేశాలు జారీ చేసింది. యాంటీ న‌క్సల్ ఫోర్స్ నుంచి 248 మంది పోలీసులను తీసుకొని ఓ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. వారు రాష్ట్రంలో జ‌రిగే మ‌త ఘ‌ర్షణ‌ల‌ను అణిచివేసేందుకు ఎల్లపుడూ సిద్ధంగా ఉంటారు. మూడు కంపెనీల‌తో ఆ ద‌ళం ఉంటుంద‌ని పేర్కొన్నది. 

Also Read :  పాకిస్తాన్‌తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు

Communal Clashes In Karnataka

Also Read :  తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి

ద‌క్షిణ క‌న్నడ‌, శివ‌మొగ్గం, ఉడిపి జిల్లాల్లో ఆ స్పెష‌ల్ యాక్షన్ ఫోర్స్ మ‌త‌ఘ‌ర్షణ వివాదాల‌పై దృష్టి పెట్టనున్నది. దీనికి సంబంధించిన ఆదేశాల‌ను బుధవారం రిలీజ్ చేశారు. అందులో 248 మంది సిబ్బంది ఉంటారు. సీనియ‌ర్ డీఐజీపీ స్థాయి అధికారి కూడా ఒకరు ఉంటారు. మ‌త‌ప‌ర‌మైన ఘ‌ర్షణ‌లు, ప్రేరేపిత ఘ‌ట‌న‌లు, విద్వేష ప్రసంగాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ స‌మాచారాన్ని సేక‌రించ‌డం ఆ స్పెష‌ల్ యాక్షన్ ఫోర్స్ తొలి ప్రాధాన్యత. 

Also Read :  కవిత వివాదం.. బీజీపీలో బీఆర్ఎస్ విలీనం.. బీఆర్ఎస్ నేత వినోద్ సంచలనం!

Also Read :  జూన్‌ 10 నాటికి జగన్‌ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

latest-telugu-news | Special force | communal clashes | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు