/rtv/media/media_files/2025/04/15/BMax2SYR5miHf4AKwqQw.jpg)
Attack on toll staff
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సమీపంలోని టోల్ సిబ్బందిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగినందుకు.. జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి రెచ్చిపోయాడు. అతనితో పాటు కుటుంబ సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు.
Also Read: America Earth Quake: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం
Attack On Toll Staff
టోల్ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్బండ్కు చెందిన హుస్సేన్ సిద్ధిక్ సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డుల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇవాళ ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి ఔటర్ రింగ్ రోడ్డుపైకి వచ్చాడు. రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్డు నెంబర్ 17 వద్ద ఎగ్జిట్ అవుతుండగా టోల్ సిబ్బంది డబ్బులు అడిగారు. తన కారుకు టోల్ మినహాయింపు ఇవ్వాలని హుస్సేన్ సిద్ధికి టోల్ సిబ్బందిని కోరాడు. అయితే ఆ కారుకు టోల్ మినహాయింపు లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని టోల్ సిబ్బంది తెలిపారు. మీకు టోల్ మినహాయింపు ఉండదని.. కచ్చితంగా టోల్ ఫీ చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో సిబ్బందిని పట్టించుకోకుండా హుస్సేన్ సిద్ధిక్ కారును పక్క నుంచి పోనిచ్చేందుకు ప్రయత్నించాడు.
Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్ వద్దు.. యూనస్కు హసీనా వార్నింగ్
అది గమనించిన టోల్ సిబ్బంది.. సిద్దిక్ కారును ఆపారు. దీంతో హుస్సేన్ సిద్ధి ఒక్కసారిగా కోపంతో ఉగిపోయాడు. ఆగ్రహించిన సిద్దిక్ కుటుంబసభ్యులు టోల్ సిబ్బందిపై దాడికి దిగారు. అక్కడే ఉన్న ఇతర సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో టోల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టోల్ గేట్ ఎగ్జిట్ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించారు.
Also Read: America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!
Also Read : నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా..టోల్ సిబ్బందిపై దాడి
govt-employees | toll-gates | Toll Gate Charges | rajendranagar-outer-ring-road | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | latest telangana news