Hyderabad : నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా.. టోల్ సిబ్బందిపై దాడి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ టోల్ సిబ్బందిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగినందుకు జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి రెచ్చిపోయాడు. అతనితో పాటు కుటుంబ సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు.