Telangana Assembly Sessions: ఇవాళ్టి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పలు అంశాల్లో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్(BRS) రెడీ అవుతోంది. ఇటు అధికారి పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేకపోవడంతో అనేక బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన వ్యవహారంలో బీజేపీని(BJP) టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అలాగే ఉచిత విద్యుత్ విషయంలోనూ కాంగ్రెస్ తీరును ఎండగట్టి…కాంగ్రెస్(Congress) పనితీరును ప్రజలకు అర్థమయ్యే సభ ద్వారా సీఎం కేసీఆర్(CM KCR) వివరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు కావడంతో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టి..ఆమోదించబోతోంది.
పూర్తిగా చదవండి..నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్..!!
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఎత్తుకు పైఎత్తులతో అధికారపార్టీ రెడీ అవుతోంది. మొత్తానికి ఈ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది.
Translate this News: