కేసీఆర్ పై కేసు.. విద్యుత్ కమిషన్ ఆదేశాలు!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి , కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, టి .ప్రకాష్ గౌడ్ తదితరులు ఈ రోజు కేసీఆర్ ను కలిశారు. తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని వారు అధినేతకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఖమ్మం పర్యటనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న పువ్వాడ నాగేశ్వరావును పరామర్శించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సుయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా మార్గమధ్యలో ఓ టీ హోటల్ వద్ద కేసీఆర్ ఆగి స్నాక్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలతో ముచ్చటించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎడమ తుంటికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు ఈరోజు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ కొద్ది సేపటి క్రితం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన రోజే జగన్ కేసీఆర్ నివాసానికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల కాలుకు శస్త్రచికత్స జరగడంతో హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ రేపు పరామర్శించనున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎంపీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చాలని భావిస్తున్న కేసీఆర్.. మహబూబాబాద్ ఎంపీ టికెట్ ను ఐఆర్ఎస్ అధికారి జీవన్ లాల్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ ప్రజలకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ జీవన్ లాల్ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు ఈ చర్చకు కారణమయ్యాయి.
తెలంగాణలో ఎంపీ ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలన్నది రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. అప్పటిలోగా ఆరు గ్యారెంటీల అమలు, సర్పంచ్ లకు పెండింగ్ బకాయిల చెల్లింపు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సర్కార్ భావిస్తోందని సమాచారం.