BIG BREAKING : హైదరాబాద్ సమీపంలో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనాలు
ఓ వైపు జనాలు భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు వణికిపోతుంటే మరోవైపు భూ ప్రకంపనలు జనాలను మరింత భయపెడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది.
ఓ వైపు జనాలు భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు వణికిపోతుంటే మరోవైపు భూ ప్రకంపనలు జనాలను మరింత భయపెడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది.
వికారాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. బావిలో దూకిన భార్యను కాపాడబోయి భర్త, భార్య చెల్లెలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోమిన్పేట మండలం చీమలదరిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తండ్రితో కలిసి భార్య తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో చోటుచేసుకుంది. బార్య జయశ్రీ భర్త వెంకటేష్ చేతులు పట్టుకోగా, ఆమె తండ్రి పండరి అల్లుడి గొంతు నులిమి హతమార్చాడు.
వికారాబాద్ జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. సర్పన్పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల బోటు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో ఐదుగురు పర్యటకులు ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాకి చెందిన టూరిస్టులు పరిగిలో జరిగిన విందుకు బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రభుత్వంపై మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్ చేశారు. ఉచితాలు తగ్గించాలని.. అర్హులకే మాత్రమే ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు కిలో బియ్యం రూ.60 ఉండగా ఉచితాలు ఇవ్వడం సరికాదన్నారు. తినడానికి లేనివారికే బియ్యం ఇవ్వాలని చెప్పారు.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాత రైతుబజారులో బతుకమ్మ చీరల కట్టలు కుప్పలు,కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయడం కోసం కేటాయించిన చీరలను జిల్లాలోని తాండూరుతో సహా పలు ప్రాంతాల్లో అధికారులు అందజేయలేదు.
వికారాబాద్ జిల్లాలో పదిలక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనినుంచి పది లకల విలువ చేసే నకిలీ పత్తివిత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
కట్నం వేధింపులతో నవ వధువు సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీజ(21)కు సాయికుమార్ అనే వ్యక్తితో గతేడాది నవంబర్ లో పెళ్లైంది. బాగానే కట్నం ఇచ్చిన ఇంకింత కట్నం తేవాలని అత్తింటివారు ఒత్తిడి పెట్టారు. దీంతో శ్రీజ సూసైడ్ చేసుకుంది.