/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
విందుకు వెళ్లి తిరిగి వస్తుండగా..
పరిగిలో జరిగిన ఓ విందుకు పలువురు టూరిస్టు బస్సులో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉండగా.. దాన్ని బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు చికిత్స తీసుకుంటుండగా మృతి చెందారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?
ఇదిలా ఉండగా ఏపీ నంద్యాల జిల్లాలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన సంతోష్(47), లోకేశ్ (37), నవీన్ (37)గా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం, మహానంది ఆలయాలు దర్శించుకుని డోన్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
ఇక పోతే తెలంగాణలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇంకా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. చెట్టుపెల్లి శ్వేత (40), నూగ దుర్గ (38) మృతులుగా గుర్తించారు. మేడారం వెళ్లి ట్రాక్టర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇలా వేర్వేరే ప్రాంతాల్లో మొత్తం 18 మంది మృతి చెందారు.
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్ఫుల్ బ్రో..
telangana | road-accident | vikarabad