ఈ కార్డు ఉంటేనే తిరుపతి దర్శనానికి అనుమతి | TTD Shocking Decision On Tirupati Darshan | RTV
తిరుమల తిరుపతి దేశస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం కావడంతో భక్తులు దైవదర్శనానికి పోటెత్తారు. మరోవైపు వేసవి సెలవుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందనే కారణమే కాకుండా ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు.
తిరుమలలో ఈనెల 9నుంచి 13 వరకు జరగనున్న సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. కొండపై ఉన్న వెంగమాంబ కేంద్రంలోని అన్నప్రసాదం మెనూలో మరో స్పెషల్ ఐటెమ్ను టీటీడీ చేర్చింది. ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శెనగపప్పు వడలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భక్తులకు అడవి జంతువులు నుంచి రక్షణ కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జంతువుల నుంచి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు యానిమల్ రేడియో కాలర్ సిస్టంను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని కోసం వైల్డ్లైఫ్ అధికారుల అనుమతి కూడా కోరినట్లు తెలుస్తోంది.
టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్కు క్షమాపణలు చెప్పాడు. క్షణికావేశంలో తప్పు చేశానని, కలసికట్టుగా మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. దేవస్థానం ఖ్యాతిని పెంపొందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసనకు దిగారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.
తిరుమలలో బోర్డు సభ్యుడు నరేష్కుమార్ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. మహాద్వారం నుంచి వెళ్లడానికి లేదని చెప్పిన ఉద్యోగి బాలాజీని దూషించారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్ బయటకు పో.. థర్డ్ క్లాస్ వాడివి నాకు చెప్తావా? అంటూ మాట్లాడారు.