/rtv/media/media_files/WfHHEnrrP3RFI96YuLbu.jpg)
తిరుమల స్వామి వారి భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ప్రజలందరికీ యూట్యూబ్ ద్వారా అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో ఈవో, వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
ఇప్పటికే అన్నమయ్య సంకీర్తనలను ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి, వారి సలహాలు, సూచనలతో వేగవంతంగా సంకీర్తనలను యూట్యూబ్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్లో రాహుల్ గాంధీ పర్యటన
అలాగే వేసవి సందర్భంగా తిరుమలలో టీటీడీ స్థానిక ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, రద్ధీ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జేఈవో కు పలు సూచనలు చేశారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలోని వివిధ ప్రాజెక్ట్లలో జరుగుతున్న కార్యక్రమాలపై అధికారులతో ఆయన చర్చించారు.
అనంతరం తిరుపతిలోని ఆరోగ్య విభాగం, శ్వేత, టీటీడీ కొనుగోళ్ల విభాగం, స్విమ్స్, విద్యా, వైద్యం, తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వేద విశ్వవిద్యాలయం వీసీ రాణి సదాశివమూర్తి, ఎఫ్ ఎ అండ్ సిఎవో బాలాజి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Air india:పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్ ఇండియా!
Also Read: Hyderabad Metro: వివాదంలో హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం
tirumala | youtube | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | ttd | eo | ttd-jeo | ap-news | tirumala-news