TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ కీలక నిర్ణయం!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

New Update
TTD Chairman BR Naidu

TTD Chairman BR Naidu

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నెల 15 నుంచి తెలంగాణ, ఏపీకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను కేటాయించనున్నట్లు తెలిపారు.

Also Read :  సంచలన తీర్పు.. లైంగిక వేధింపుల కేసులో 8మందికి జీవిత ఖైదు

Also Read :  వల్లభనేని వంశీకి బెయిల్!

Also Read :  పాక్ ఎయిర్ బేస్‌‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి

సాధారణ స్థాయికి చేరుకున్న రద్దీ..

వేసవి సెలవుల నేపథ్యంలో బ్రేక్ దర్శనానికి సిఫారసు లేఖల స్వీకరణను నిలిపివేసింది. మే 1 నుంచి జులై 15 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని గతంలో ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయికి చేరింది. దీంతో మళ్లీ సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని టీటీడీ నిర్ణయానికి వచ్చింది.

ఇదిలా ఉంటే.. భద్రత దృష్ట్యా తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తిరుమల కొండపై ఇటీవల కొందరు డ్రోన్లు ఎగరవేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీని తీసుకువస్తే డ్రోన్లను పూర్తి స్థాయిలో కట్టడి చేసే అవకాశం ఏర్పడుతుంది.

Also Read :  IPL 2025: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్.. RCBకి కోలుకోలేని దెబ్బ.. వారంతా జంప్!

(ttd | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
తాజా కథనాలు