టర్కీలో ఉగ్రదాడి,కాల్పులు..
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. కుప్వారా జిల్లా సరిహద్దులో సైనికులు ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ను చేపట్టారు. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
టెర్రరిస్టు-గ్యాంగ్స్టర్ నెక్సస్ కేసులో ఇతర కేటీఎఫ్ అనుమానితులతో సంబంధం ఉన్న 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం, 30 ప్రదేశాలలో NIA ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడిలో డిజిటల్ పరికరాలతో సహా అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది.
ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్టుగా ఒకే ఒక్క క్లూ ఎన్నో ఏళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న సిమి ఉగ్రవాదిని పట్టిచ్చింది. 22 ఏళ్ళుగా పరారీలో ఉన్న హనీఫ్ షేక్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసేలా చేసింది.
ఉగ్రవాదిగా మారి పాక్ టెర్రరిస్టులకు సహకరిస్తున్న మాజీ ఆర్మీ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కుప్వారాకు చెందిన రియాజ్ అహ్మద్గా గుర్తించారు. జమ్మూకశ్మీర్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు పీవోకేలోని లష్కరే నాయకులతో చేతులు కలిపినట్లు వెల్లడించారు.
కెనడాలో ఉన్న గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లండా ఉగ్రవాదే అంటూ ప్రకటన జారీ చేసింది భారత ప్రభుత్వం. ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రహోంశాఖ తెలిపింది.
పాకిస్థాన్ ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొత్తం 24 మంది మరణించగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ అధికారులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డట్లు ఉగ్రవాద సంస్థ 'టీజేపీ' ప్రకటించింది.
భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, పఠాన్ కోట్ దాడి సూత్రధారి జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ ను పాకిస్తాన్ లో చంపేశారు. పంజాబ్ లోని సియాకోట్ లో అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న ఇస్లామిగ్ స్టేట్ టెర్రరిస్ట్ మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు దేశ రాజధాని పోలీసులు తెలిపారు.