Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రాజ్‌బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.

New Update
2 militants killed, 5 policemen injured in gunbattle

2 militants killed, 5 policemen injured in gunbattle

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రాజ్‌బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆదివారం హిరానగర్‌ సెక్టార్‌లో యాంటి టెర్రరెస్టు ఆపరేషన్‌లో తప్పించుకున్న తీవ్రవాదులనే గురువారం భద్రత బలగాలు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. అయితే గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఎరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. 

Also Read:  పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!

ఇదిలాఉండగా గత నెలలో జమ్మూకశ్మీర్‌లోని అఖ్‌నూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిని భారత సైనిక దళానికి చెందిన వైట్‌ నైట్‌ కార్ప్స్ నిర్ధరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. 

Also Read: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ?

ఈ ఘటన తర్వాత మళ్లీ జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు మరోసారి కాల్పులు జరిపారు. రాజౌరిలోని సుందర్‌బాని ప్రాంతంలో సైనికులు వాహనంపై వెళ్తుండగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. మొత్తం నాలుగు రౌండ్లు వాహనంపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. దీంతో సైనికులు వెంటనే అలర్ట్ అయ్యి ఎదురు కాల్పులకు దిగారు. 

Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్‌ కామెడీ అంటూ!

Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు

 rtv-news | terrorist | jammu-and-kashmir

Advertisment
Advertisment
తాజా కథనాలు