Terrorist Attack: పహల్గామ్ అటాక్ సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్!

అనంత్ నాగ్ లోని పహల్గామ్లో బైసరన్ లోయలో దారుణ మారణకాండకు తామే బాధ్యలము అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. అయితే దీనికి సూత్రధారి మాత్రం  లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ అని భావిస్తున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
terrorist

Saifullah Sajid Jutt, a Lashkar-e-Taiba commander

పహల్గామ్ లో దాడికి పాల్పడిన టెర్రరిస్టులలో నలుగురిని భద్రతా దళాలు గుర్తించారు. ఇందులో ఒకరికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఉగ్రవాది కాల్పులు జరిపిన తర్వాత పారిపోతున్న వీడియోను పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ దాడికి అసలు సూత్రధారిని గుర్తించినట్టు తెలుస్తోంది. భద్రతా సంస్థల ఉన్నతాధికారుల కథనం ప్రకారం లష్కరే తోయిబాకు చెందిన టాప్ లీడర్ సైఫుల్లా సాజిద్ జాట్ పహల్గామ్ దాడికి సూత్రదారుడని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో నాలుగు రోజులకు ముందు ఆక్రమిత పాకిస్తాన్ లో జరిగిన మీటింగ్స్ లో సైఫుల్లా కాశ్మీర్ గురించి, ఉగ్రదాడి గురించి మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో క్లియర్ గా త్వరలోనే కాశ్మీర్ లో దాడులు జరుగుతాయని అతను చెప్పాడు. దాంతో సైఫుల్లానే దాడులకు సూత్రదారుడని భావిస్తున్నారు. 

లష్కరే తోయిబా అగ్రనాయకుడు..

సైఫుల్లా సాజిద్ జట్...ఇతనినే సైఫుల్లా కసూరి అని కూడా పిలుస్తారు.  కసూరి.. పాకిస్తాన్‌ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని షాంగమంగా గ్రామానికి చెందినవాడు. జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ సైఫుల్లాను కరడుగట్టిన ఉగ్రవాదిగా పేర్కొంది.  ప్రస్తుతం ఇతను ఇస్లామాబాద్‌లోని లష్కరే తోయిబా స్థావరం నుండి పనిచేస్తున్నాడు. కసూరి వయసు 45 ఏళ్ళు. ఒకపక్క ఉగ్రవాద అగ్రనాయకుడిగా ఉంటూనే...బయటకు మాత్ర చాలాపెద్ద మిషిలా వ్యవహరిస్తాడని..మత గురువు కింద చెలామణి అవుతాడని వివరాలు చెబుతున్నారు. ఐఎస్ఐ, పాకిస్తాన్ సైన్యంలో కీలక వ్యక్తులతో కసూరికి మంచి సంబంధాలున్నాయని తెలుస్తోంది. 

today-latest-news-in-telugu | lashkar-e-taiba 

Also Read: Pahalgam Attack: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు

Advertisment