/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Terrorist-jpg.webp)
పాకిస్తాన్ ఉగ్రవాది సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ మళ్ళీ ఇండియాలో దాడులు చేసేందుకు కుట్ర పన్నింది. దీని మద్దతు కలిగిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ రెండు టెర్రర్ మాడ్యూల్స్ ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. దీన్ని పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఈ కుట్రలో పాల్గొన్న 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నాడని సమాచారం. దీంతో పాటూ టెర్రరిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్(ఆర్పీజీ), ఒక రాకెట్ లాంచర్, రెండు ఐఈడీలను, హ్యాండ్ గ్రెనేడ్స్, ఆర్డీఎక్స్, పిస్టల్స్, కమ్యూనికేషన్ పరికరాలను, పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
రెండు ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా..
ఈ రెండు కుట్రలను భగ్నం చేయడానికి పంజాబ్ పోలీసులు రెండు ప్రత్యేకమైన ఆపరేషన్లను చేపట్టారు. ఇందులో కౌంటర్ ఇంటెలిజెన్స్ బలంధర్, బటాలా జిల్లా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ నాయకత్వం వహించారు. ఈ రెండు టెర్రర్ మాడ్యుల్స్ని ఫ్రాన్స్కు చెందిన సత్నామ్ సింగ్ అలియాస్ సత్తా, గ్రీస్కు చెందిన జస్వీందర్ సింగ్ అలియాస్ మన్ను అగ్వాన్ నిర్వహిస్తున్నట్లు తేలింది. అరెస్టయిన ఇతర వ్యక్తులను పవన్ప్రీత్ సింగ్, బల్బీర్ కుమార్ అలియాస్ వరుణ్, గోమ్జీ అలియాస్ గొట్టా, గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపి, అజయ్పాల్ సింగ్, రాహుల్ అలియాస్ భైయా, జోహన్సన్ మరియు జతీందర్గా గుర్తించారు.
today-latest-news-in-telugu | isi | pakistan | terrorist
Also Read: IPL 2025: 14 ఏళ్ళకే ఐపీఎల్ ప్రవేశం..చరిత్రలో నిలిపోయే వైభవ సూర్యవంశీ