/rtv/media/media_files/2025/04/23/LNkEObBLSIZJk9uyjirI.jpg)
terrorist attacks
అనంతనాగ్ లోని బైసరన్ వ్యాలీలో టీఆర్ఎఫ్ కు చెందిన ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో ఇప్పటివరకు 28 మంది చనిపోయారు. మరో 60 మంది గాయాలపాలయ్యారు. చనిపోయిన వారందరూ టూరిస్టులు, సామాన్య ప్రజలు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు మతం , పేరు అడిగి మరీ చంపేశారు. కొందరిని ముస్లింలకు సంబంధించిన ప్రార్థనలు చేయమని అడిగారు. చేయలేకపోతే ప్రాణాలు తీశారు. కేవలం మగవాళ్లను మాత్రమే చంపారు. అయితే ఉగ్రవాదులు సామాన్య ప్రజల మీద దాడులు చేయడం చంపేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలానే చేశారు.
మార్చి 21, 2000..
2000 మార్చి 20న ఇలాగే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ న్యూ ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అనంత్నాగ్ జిల్లాలో ఛత్తీసింగ్పొరలో ఉగ్రవాదులు 36 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకొన్నారు. సిక్కువర్గంలోని వారిని ఏరి మరీ ఉగ్రమూక చంపేశారు. అప్పుడు కూడా భారీ తుపాకులు, రెండు సైనిక వాహనాల్లో వచ్చి తాము సైనికులమని చెప్పుకుంటూ పురుషులను గురుద్వారా దగ్గరకు రావాలని ఆదేశించారు. ఆ తర్వాత వారందరి ప్రాణాలు తీశారు.
ఆగస్టు 2000...
పహల్గామ్లోని నున్వాన్ బేస్ క్యాంప్పై జరిగిన ఉగ్రవాద దాడిలో 24మంది అమర్నాథ్ యాత్రికులు సహా 32 మంది మరణించారు.
జూలై 2001..
అమర్నాథ్ యాత్రికులపై మళ్ళీ దాడి జరిగింది. ఈసారి అనంత్నాగ్లోని శేషనాగ్ బేస్ క్యాంప్పై ఉగ్రవాద దాడి జరిగింది. దీనిలో 13 మంది మరణించారు.
అక్టోబర్ 1, 2001..
శ్రీనగర్లోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ సముదాయంపై ఆత్మాహుతి దళం అయిన ఫిదాయీన్ ఉగ్రవాద దాడి చేశారు. ఈ దాడిలో 36 మంది మరణించారు.
2002 అమర్ నాథ్ యాత్రికులు..
కాశ్మీర్లోని చందన్వారీ బేస్ క్యాంప్పై ఉగ్రవాద దాడి జరిగింది. దీనిలో 11 మంది అమర్నాథ్ యాత్రికులు మరణించారు.
23 నవంబర్, 2002..
జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై దక్షిణ కాశ్మీర్లోని లోయర్ ముండా వద్ద జరిగిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ పేలుడులో 9 మంది భద్రతా సిబ్బంది, 3 మంది మహిళలు, 2 పిల్లలు సహా 19 మంది మరణించారు.
మార్చి 23, 2003..
పుల్వామా జిల్లాలోని నంది మార్గ్ గ్రామంలో 11 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు సహా కనీసం 24 మంది కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు చంపారు.
జూన్ 13, 2005..
పుల్వామాలోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా రద్దీగా ఉండే మార్కెట్లో పేలుడు పదార్థాలతో నిండిన కారు పేలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు, 3 సీఆర్పీఎఫ్ అధికారులు సహా 13 మంది మరణించారు. ఈ దాడిలో 100 మందికి పైగా గాయపడ్డారు.
జూన్ 12, 2006..
కాశ్మీర్లోని కుల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో తొమ్మిది మంది నేపాలీ, బిహారీ కార్మికులు మరణించారు.
జూలై 10, 2017..
కాశ్మీర్లోని కుల్గాంలో అమర్నాథ్ వెళుతున్న బస్సుపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది మృతి చెందారు.
today-latest-news-in-telugu | jammu-kashmir | terrorist