మోదీతో పెట్టుకోవద్దు రా.. ఉగ్రవాది తల్లి.! | Terrorist Mother Emotional Comments On Video Call | RTV
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ బుద్ధి మరోసారి బయటపడింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ దాడిలో మరణించిన టెర్రరిస్టు మౌలానా మసూద్ కుటుంబానికి భారీ నష్టపరిహారం ప్రకటించింది. ప్రభుత్వ సహాయ నిధి నుంచి రూ.14 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాకిస్తాన్ బెదిరిస్తే ఇండియా సహించదని ప్రధాని మోదీ హెచ్చరించారు. బ్లాక్మెయిల్ చేస్తే వారినే టార్గెట్ చేసి అటాక్ చేస్తామని మోదీ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ పోరు ఆపదని ప్రధాని తేల్చి చెప్పారు.
పీఓకేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు హాజరైయ్యారు. బిలాల్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ అధిపతి యాకుబ్ మొఘల్ చనిపోయిన విషయం తెలిసిందే. అతని అంతిమ సంస్కారాల్లో ISI, ఆర్మీ అధికారులు హాజరైయ్యారు.
కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో మరో ఉగ్రవాది ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను పోలీసులు అరెస్టు చేశారు. వేషా నది నదిలోకి దూకి అతడు పారిపోయే ప్రయత్నం చేశాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారత్తో ఉద్రిక్తత పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో అంతర్యుద్ధ ప్రమాదం పొంచిఉంది. ఆఫ్గనిస్తాన్లో కలవాలని తాలిబన్లు, బలుచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని ఏర్పాటు వాదులు పాక్ ఆర్మీపై దాడులు చేస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా పాక్ పరిస్థితి ఉంది.
భారత్ సిందూ ఒప్పందం రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది. పాక్ ప్రధాన మంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే.. తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది.
ప్లాన్ ప్రకారం టార్గెట్ను నాశనం చేయడమే సర్టికల్ స్ట్రైక్. భారత్ ఉగ్రవాదులపై 2016లో ఆర్మీతో, 2019లో ఎయిర్ ఫోర్స్తో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆర్మీలో పారా కమాండోలు, నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్లో గరుడ సర్జికల్ స్ట్రైక్స్కు పెట్టింది పేరు.