/rtv/media/media_files/2025/08/02/jammu-kashmir-encounter-2025-08-02-07-57-24.jpg)
జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని హతమార్చామని శనివారం ఉదయం ఆర్మీ అధికారులు ధృవీకరించారు. దక్షిణ కశ్మీర్లోని అకల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టుల కదలికల సమాచారంతో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.
OP AKHAL, Kulgam
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 1, 2025
Contact established in General Area Akhal, Kulgam. Joint Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IApic.twitter.com/d2cHZKiC61
చనిపోయిన ఉగ్రవాది లష్కరే తోయిబాకు చెందినవాడని అనుమానిస్తున్నారు. అయితే, అతడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉంటారని ఇండియన్ ఆర్మీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసి, మొత్తం అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. రాత్రిపూట ఆపరేషన్ చేయడం సవాలుగా ఉన్నప్పటికీ, ఉగ్రవాదులు తప్పించుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
*Terrorist Killed in Kulgam Encounter, Operation Continues*
— Nadeem Nadu (ندیم مختار) (@NadeemNadu3) August 2, 2025
Nadeem Nadu
Srinagar, Aug 2 (KNC): An unidentified terrorist was killed in an ongoing encounter in the Akhal forest area of South Kashmir’s Kulgam district on Saturday morning, officials said.
A top police officer…
ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను తీవ్రతరం చేశాయి. 'ఆపరేషన్ మహదేవ్' పేరుతో భద్రతా దళాలు ఉగ్రవాదులను ఏరివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగానే కుల్గామ్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ చర్యలు సరిహద్దుల భద్రతను బలోపేతం చేయడంతో పాటు, స్థానిక ప్రజలకు భరోసా కల్పించేందుకు తోడ్పడతాయి. అయితే, అకల్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.