/rtv/media/media_files/2025/05/30/010Onl0a2c74gJyWatU4.jpg)
terrorists movements in the city
Terrorist Movement In Warangal : విజయనగరం కేంద్రంగా ఉగ్రకుట్రకు తెరలేపిన సిరాజ్ టీం కు సంబంధించిన 20 మందికోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. కాగా వరంగల్ లో ఈ బృందానికి సంబంధించిన ఉగ్రవాద కదలికలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏడేళ్లుగా హైదరాబాద్లో మకాం వేసిన సిరాజ్.. సమీర్ కలిసి ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్కు చెందిన ఫర్హాన్ మోయినుద్దీన్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. ఫర్హాన్ మొహియుద్దీన్ తో పాటు మరొక అనుమానితున్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు
-- ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఎన్ఐఏ అధికారులు సిరాజ్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా -- విజయనగరం బాంబు పేలుళ్ల కుట్రలో నిందితుడిగా సిరాజ్ కు ఫర్హాన్ మొహియుద్దీన్ అనుచరుడిగా ఎన్ఐఏ గుర్తించింది. కాగా -- సిరాజ్ ఆదేశాలతో పర్హాన్ ఖాజీపేటలోని మరో యువకున్ని కలిసినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. దాంతో ఆ యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా.. సిరాజ్ కౌంటర్ను మెచ్చుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి, సిరాజ్కు నాలుగు రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కొనసాగినట్లు పోలీసులు నిర్థారించారు. అతనికోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?