Terror attack In Iran: ఇరాన్‌లో బరితెగించిన ఉగ్రవాదులు.. కోర్టుపై భీకర కాల్పులు

ఇరాన్‌లో ఉగ్రవాదులు కోర్టుపైనే కాల్పులు జరిపారు. సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్‌లోని కోర్టు బిల్డింగ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు పౌరులు, ముగ్గురు దాడి చేసినవారు సహా కనీసం ఎనిమిది మంది మరణించారు.

New Update
Iran terror attack

Iran terror attack

ఆగ్నేయ ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా కోర్టుపైనే కాల్పులు జరిపారు. ఇరాన్ స్థానిక సమయం ప్రకారం.. శుక్రవారం సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్‌లోని కోర్టు బిల్డింగ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు పౌరులు, ముగ్గురు దాడి చేసినవారు సహా కనీసం ఎనిమిది మంది మరణించారు. ఈ ప్రాంతంలో యాక్టీవ్‌గా ఉన్న సున్నీ ఉగ్రవాద సంస్థ జైష్ అల్-అద్ల్, ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇరాన్ మీడియా ఛానళ్లు తెలిపాయి. కోర్టు భవనం చుట్టూ కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇందులో ఆత్మాహుతి దాడి జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సెంట్రల్ జహెదాన్‌లోని కోర్టు హాల్ సముదాయంలో న్యాయమూర్తుల గదుల్లోకి ముష్కరులు చొరబడ్డారు. కనీసం 13 మంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ప్రకటించింది. బలూచ్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న మానవ హక్కుల సంస్థ HAALVSH, ఈ దాడిలో అనేక మంది జుడిషియల్ ఆఫీసర్లు, భద్రతా సిబ్బంది మరణించారని లేదా గాయపడ్డారని చెప్పింది. భద్రతా దళాలు వెంటనే స్పందించి దాడి చేసిన వారిని మట్టుబెట్టగలిగాయి. ఈ ఘర్షణలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు నిర్ధారించారు.

Advertisment
తాజా కథనాలు