Tamilnadu: దానికి ఇంకా సమయం ఉంది..స్టాలిన్
తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అయ్యేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్. పార్టీలో దీని గురించి డిమాండ్ పెరుగుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో లేదని చెప్పారు.
తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అయ్యేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్. పార్టీలో దీని గురించి డిమాండ్ పెరుగుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో లేదని చెప్పారు.
మహారాష్ట్రలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ (50) ను గుర్తు తెలియని వ్యక్తులు అడవిలో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
కేంద్రం బడ్జెట్లో తమిళనాడుకు అన్యాయం చేసిందని, దీనికి నిరసనగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరి అవుతారని హెచ్చరించారు.
తమిళనాడులోని మధురైలో నామ్ తమిజార్ కట్చి పార్టీ (NTK) నేత బాలసుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఇటీవలే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కే.ఆర్మ్స్ట్రాంగ్ హత్య జరిగిన వారం రోజులకే ఎన్టీకే నేతను మర్డర్ చెయ్యడం కలకలం రేపుతోంది.
దారుణ హత్యకు గురైన తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ భౌతిక కాయానికి బీఎస్పీ అధినేత మాయావతి నివాళి అర్పిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఉండాలని సూచించారు.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో కులగణన చేపట్టగా, దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు.
తమిళనాడులో కల్తీసారా తాగి మృత్యవాత పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 40 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. మొత్తం 109 మంది చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
తమిళనాడులో కళ్లకురిచి అనే జిల్లాలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు. మరో 10 మంది ఆసుపత్రిపాలయ్యారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం ఎక్కడినుంచి వచ్చిందనే దానిపై విచారణ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికల సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే (AIDMK) పనైపోయిందని ఎవరూ భావించవద్దని.. పార్టీలో తన ప్రవేశం ప్రారంభమైందని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని ధీమావ్యక్తం చేశారు.