/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Crime-News-2.jpg)
Tamilnadu
తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరూ కాదు.. ఏకంగా ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి ఓ విద్యార్థినికి సామూహిక అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఓ 13 ఏళ్ల విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. అయితే గత నెల రోజుల నుంచి ఆ బాలిక స్కూల్కి వెళ్లడంలేదు. దీంతో స్కూల్ ప్రిన్సిపల్, మిగతా విద్యార్థినులు ఆమెను అడగ్గా స్పందించలేదు.
ఇది కూడా చూడండి: JOBS: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..డిగ్రీ ఉంటే చాలు..
ప్రిన్సిపల్ సాయంతో..
స్కూల్ ప్రిన్సిపల్ కారణం ఏంటని ఆ బాలిక ఇంటికి వెళ్లి తల్లిని అడిగారు. దీంతో ఆమె తన కూతురికి జరిగిన అన్యాయాన్ని వివరించింది. తన కుమార్తె గర్భం దాల్చిందని, అబార్షన్ చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. పాఠశాలలో పని చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారం చేసినట్లు తెలిపారు. దీంతో ప్రిన్సిపల్ షాక్ అయ్యారు. వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ సాయంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయులైన చిన్నసామి(57), ఆరుముగం(45), ప్రకాశ్(37)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: ఆపరేషన్ చేసిన స్టాప్నర్స్ కుట్లకు బదులు ఫెవిక్విక్ వాడితే.. చివరికి
ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్(UP)లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త ఉండగానే మరో పురుషుడితో అక్రమ సంబంధం(Illegal Affair) పెట్టుకున్న మహిళ తాను చెప్పిన మాట వినలేదని దారుణంగా హతమార్చింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి శృంగారం చేద్దామని ప్రియుడిని పిలిచిన ఆమె.. అతడు మత్తులో ఉండగానే నమ్మంచి ఏకంగా ప్రియుడిని చంపేసింది. ఈ ఘటన రాయ్బరేలీలో చోటుచేసుకుంది.
ఇది కూడా చూడండి: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!