/rtv/media/media_files/2025/01/14/iS25unAvHCvf49jR7VGT.jpg)
kallakkadal
కేరళ, తమిళనాడు తీరాలకు పెద్ద ముప్పు పొంచి ఉంది. జనవరి 15న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాత్రి 11.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో 0.5 నుంచి 1 మీటర్ల వరకు అలలు ఎగిసి పడతాయని చెబుతోంది. దీని వలన ఉప్పెన ముంచుకొస్తుందని...తీర ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షితంగా ఉండాలని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సూచించింది.
ఈ ఉప్పెన గురించి అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకొక్క రోజులోనే ముప్పు పొంచి ఉండడంతో ఇప్పటి నుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తీరప్రాంతాల్లో ఉన్న వారు, జాలర్లు ఎట్టి పరిస్థితుల్లో పడవలు వేసుకుని సముద్రంలోకి వెళ్ళొద్దని గట్టిగా చెబుతున్నారు. ప్రస్తుతం జారీ చేసిన ప్రకటనను విరమించుకొనే వరకు పర్యటకులు బీచ్లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు కేరళ విపత్తు సంస్థ కేఎస్డీఎంఏ సూచించింది.
Also Read: మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు.. 44 మంది అరెస్ట్
కల్లడక్కల్ అంటే ఏంటి?
సముద్రంలో హఠాతుగా జరిగే మార్పును కల్లడక్కల్ అంటారు. సముద్రం ఒక్కసారిగా పోటెత్తడమే కాకుండా తీరాన్ని ముంచేస్తుంది. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్ని సార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని ండియన్ ఓషన్ సర్వీసెస్ చెబుతోంది. ముందుగా ఎలాంటి సూచనలు ఉండవు..గాలులు బలంగా వీస్తాయి. తమిళ మలయాళాల్లో కడల్ అంటే సముద్రం అని అర్ధం. అందుకే దీనికి కల్లడక్కల్ అనే పేరు పెట్టారు.
Also Read: నీ గూగుల్ సెర్చ్కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..!
Also Read: సౌదీకి వెళ్లాలనుకునేవారికి బిగ్ షాక్.. రూల్స్ మరింత కఠినం