తమిళనాడు లో దంచికొడుతున్న వర్షాలు
ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ ఈ నెల చివర్లో మొదటిసారిగా బహిరంగ సమావేశం నిర్వహించనుంది.ఈ సందర్భంగా విజయ్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ మాటల గారడీ పార్టీ కాదని.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఇటీవల తమిళనాడులో కవరైపెట్టై రైల్వేస్టేషన్ దగ్గర మైసూరు -దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్.. గూడ్స్ రైలును ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు వెంటనే తమను సంప్రదించాలని దక్షిణ రైల్వే సోషల్ మీడియా వేదికగా కోరింది.
భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన ‘మెగా ఎయిర్ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను చూసేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై మధురైలో కేసు నమోదైంది. సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కల్యాణ్ అనవసర వ్యాఖ్యలు చేశారంటూ వంజినాథన్ అనే న్యాయవాది మధురై కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పవన్ పై కేసు నమోదు చేశారు.
తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్కు కారులో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4.7 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులోని ఉలుందూరుపేట సమీపంలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్టటూరు సమీపంలో టూరిస్ట్ వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై - బెంగళూరు నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. వారిలో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు.హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.