/rtv/media/media_files/2025/03/03/luR006R7BTzFn4nohIxQ.jpg)
CM Stalin
ప్రస్తుతం డీలిమిటేషన్ (Delimitation) అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్సభ స్థానాలు తగ్గిపోతాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. దంపతులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో పిలిపునిచ్చిన సీఎం స్టాలిన్.. తాజాగా మరోసారి స్పందించారు. డీలిమిటేషన్ వల్ల నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు త్వరగా పిల్లలు కనాలని కోరారు.
Also Read: నడిరోడ్డుపై వధువు కిడ్నాప్.. ఊరేగింపు మధ్యలో ఎలా ఎత్తుకెళ్లారంటే?
MK Stalin's Advices Tamil People To Have Babies Immediately
నాగపట్నంలోని జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ (MK Stalin) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '' కొత్త దంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలోనే నేనే చెప్పాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జనాభాను పెంచుకోలేక తప్పని పరిస్థితుల్లోకి మనం నెట్టివేయబడ్డాం. నేను కోరుకునేది ఒక్కటే. కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కని వాళ్లకి మంచి తమిళ్ పేర్లు పెట్టండని'' సీఎం స్టాలిన్ అన్నారు.
Also Read: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ పోస్టు .. డిలీట్ చేసిన ముస్లిం మహిళా నేత!
ఇదిలాఉండగా ఇటీవల కోళత్తుర్లో జరిగిన ఓ వివాహ వేడుకలో కూడా సీఎం స్టాలిన్ దీని గురించి మట్లాడారు. గతంలో మనం కుటుం నియంత్రణ ప్రచారాన్ని చేపట్టామని.. కానీ దీనివల్ల రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజనతో లోక్సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అలాగే దీనిపై చర్చించేందుకు మార్చి 5న సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. అంతేకాదు ఈ సమావేశంలో పాల్గొనాలని రాష్ట్రంలోని 40కు పైగా పార్టీలకు ఆహ్వానం కూడా పంపారు.
Also Read: ట్రంప్ పిలిస్తే మళ్లీ వెళ్లి మాట్లాడుతా.. జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు
Also Read: ''గంగా జలాలు దానికి పనికిరావు''.. ఆర్థిక సర్వేలో సంచలన విషయాలు