పాకిస్తాన్కి బిగ్ షాక్.. 5 వేల మందిని తరిమికొట్టిన సౌదీ | Big Shock to Pakistan | Saudi | RTV
సౌదీ అరేబియా విదేశాంగశాఖ సహాయమంత్రి అదెల్ అల్ జుబేర్ గురువారం ఉదయం భారత్కు వచ్చారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ను ఆయన కలిశారు. బుధవారం అర్ధరాత్రి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి కూడా ఢిల్లీకి చేరుకున్నారు.
సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్ సౌదీ ఎయిర్ఫోర్స్ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్గా వచ్చాయి. 2వ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.
సౌదీ అరేబియా.. ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది. గాజా, లెబనాన్పై చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని అల్టిమేటం జారీ చేసింది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సౌదీ ఇంత ఘాటుగా స్పందించడం ఇదే మొదటిసారి.
భారతీయుల్ని కాపాడిన పాకిస్థాన్కు చెందిన ఓ అధికారికి ఆ దేశం అత్యున్నత పౌర పురస్కారం ‘సితారే- ఇంతియాజ్’ లభించింది. పాకిస్థాన్ అధికారి భారతీయుల్ని కాపాడటం ఏంటని అనుకుంటున్నారా ?. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇకనుంచి సౌదీ అరేబియా వెళ్లాలనుకునేవారికి చేదు వార్త అందింది. భారతీయ కార్మికులను సంఖ్యను నియంత్రించే దిశగా అక్కడి ప్రభుత్వం కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
ఈ సంవత్సరం సౌదీ అరేబియాలో 100 మందికి పైగా విదేశీయులను ఉరితీశారు. మానవ హక్కుల సంస్థను ఉటంకిస్తూ వార్తా సంస్థ AFP ఈ సమాచారాన్ని అందించింది. గత మూడేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియాని వర్షాలు ముంచెత్తగా..తాజాగా ఎడారి దేశంలో భారీ మంచు కురుస్తుంది. రోడ్లపై తెల్లటి తివాచీలా పేరుకుపోయిన మంచును చూసి స్థానికులు ఆశ్చర్య పోతున్నారు.
సౌదీ అరేబియాలో ఖలీద్ బిన్ అనే వ్యక్తి ఒకప్పుడు 610 కేజీలు ఉండేవాడు. అతడి గురించి తెలుసుకున్న ఆ దేశ రాజు.. సొంతంగా వైద్య ఖర్చులు పెట్టుకొని చికిత్స చేయించాడు. ఇప్పుడు ఖలీద్ ఏకంగా 60 కేజీలకు తగ్గిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు.