AP: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి కారుని, బైక్ని ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.