/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
Road accident Jogulamba Gadwala
Road Accident: జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లారీని ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే... యుటర్న్ చేసుకుంటున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. నలుగురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?