Odisha: పూరీ జగన్నాథ దేవాలయం తలుపులన్నీ తెరవనున్న ఒడిశా ప్రభుత్వం!
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్ మాంఝీ తన తొలి క్యాబినెట్ సమావేశంలో భక్తుల సౌకర్యార్థం పూరీ జగన్నాథ దేవాలయం తలుపులన్నీ తెరవడానికి ఆమోదం తెలిపారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ నిర్వహణ, అభివృద్ధికి మంత్రివర్గం రూ.500 కోట్ల నిధులను కూడా కేటాయించింది.