దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. ఫ్యామిలీని కబళించిన మృత్యువు
ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 20 మంది దైవ దర్శనానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 7గురు చనిపోగా ఓ చిన్నారి చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.