దారుణం.. చేతబడి సాకుతో మహిళ సజీవ దహనం!
మెదక్ జిల్లా రామాయం పేట మండలం కాట్రియాల గ్రామంలో డేగల ముత్తవ్వ నివాసముంటుంది. చేతబడి చేస్తుందనే అనుమానంతో చుట్టుపక్కల వారు ఆమెపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ముత్తవ్వ శుక్రవారం మరణించింది.