Monkeys Attack వేడినీళ్లతో బాత్రూమ్కు వెళ్తుండగా కోతుల బీభత్సం.. వృద్ధురాలు మృతి
వరంగల్ జిల్లా పెర్కవేడులో కోతులు బీభత్సం సృష్టించాయి. మల్లమ్మ అనే వృద్ధురాలు వేడినీళ్ళతో స్నానానికి వెళ్తుండగా కోతులు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.